నరేంద్ర మోదీ : అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ధన్యవాదములు

-

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఈ సాయంత్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో మాట్లాడారు. ఈయన మొదటగా మాట్లాడుతూ మా ప్రభుత్వం వీగిపోవాలని అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ధన్యవాదములు చెప్పారు, ఆడే సమయంలో మోదీ ప్రభుత్వంపై ఎంతో అపారమైన నమ్మకాన్ని ఉంచిన దేశ ప్రజలకు సైతం ధన్యవాదములు తెలియచేశారు మోదీ. ఇది ఎవరూ అస్సలు ఊహించి ఉండరు అని చెప్పాలి. అవిశ్వాస తీర్మానంపై మోదీ మాట్లాడుతూ .. విపక్షాలు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మాపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిసారీ ఆ తర్వాత జరగనున్న ఎన్నికల్లో మునుపటి కన్నా ఎక్కువ సీట్ లనే గెలుచుకున్నాము అంటూ గతాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. బహుశా దేవుడు ఏమైనా మీకు మాపై అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పాడేమో అంటూ ఛలోక్తి విసిరారు మోదీ. ఇంతకు ముందు చాలా సార్లు మా ప్రభిత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు అన్నారు మోదీ..

ఈ సారి కూడా మీ కుటిల ప్రయత్నాలు సక్సెస్ కావు.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంటుందని ధీమాను వ్యక్తం చేశాడు మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news