పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న మోదీ..!

-

దేశంలో పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేసేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 11 గంటలకు ‘ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ – హానరింగ్ ది హానెస్ట్’ వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ‘పన్ను వ్యవస్థలో సంస్కరణతో పాటు సరళతరం చేసేందుకు ఇది మరింత దోహదపడనుంది. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి, జాతి అభివృద్ధికి కృషిచేస్తున్న వారికి ఇది ఎంతో మేలు చేకూర్చుతుంది.’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఆదాయపు పన్ను విభాగం అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్లు, ట్రేడ్ అసోసియేషన్లు, వివిధ వాణిజ్య మండలితో పాటు ప్రముఖ చెల్లింపుదారులు కూడా వీక్షించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారమన్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, గడచిన సంవత్సరం లో కార్పొరేట్ ట్యాక్స్ రేటుల ను 30 శాతం నుంచి 22 శాతాని కి తగ్గించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news