విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

-

విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే టార్గెట్ గా ఈ ముఠా కిడ్నీ రాకెట్ ను నడిపిందని వెల్లడించారు.

Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్  - NTV Telugu

ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే టార్గెట్‌గా ఈ ముఠా కిడ్నీ రాకెట్ ను నడిపిందని వెల్లడించారు. విజయవాడలో చోటు చేసుకున్న రెండు కేసులో వీరు నిందితులుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు.ఈ క్రమంలోనే ఒక్కో కేసులో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు డీల్ కుదుర్చుకుని కిడ్నీ విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు.

కిడ్నీ మార్పిడి రాకెట్‌లో కీలకమైన కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు. కిడ్నీ డోనర్‌కు రూ.7.50 లక్షలు, ఇతరులకు రూ.21.50 లక్షలు ఇచ్చేలా.. కిడ్నీ రిసీవర్ దీపక్ రెడ్డితో మీడియేటర్ కార్తీక్ డీల్ కుదుర్చుకున్నాడు. గతంలో బాబురావు అనే మీడియేటర్ వద్ద కార్తీక్ అసిస్టెంట్‌గా చేశాడు. కిడ్నీని దీపక్‌కు ఇచ్చేందుకు కార్తీక్ ఒప్పందం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. కార్తిక్ సహా మరో ముగ్గురిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news