కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా డబ్బు…

-

తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన సందర్భంగా ప్రచారానికి తెరపడింది. దీంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ నేత ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడింది. వరంగల్‌ జిల్లా కాజీపేట మండలంలోని సిద్ధార్థనగర్‌లో కాంగ్రెస్ నేత ఇంట్లో పోలీసులు రూ.3 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటర్లకు పంచడానికి వీటిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాజీపేట ప్రాంతానికి చెందిన అమృతరావు అనే కాంగ్రెస్‌ నేత తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

అందులో డబ్బు దాచి కొందరు కార్యకర్తల ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఓటర్లకు పంచేందుకు సిద్ధమయ్యారు. పక్కా సమాచారంతో  పోలీసులు తనిఖీలు చేయగా భారీ మొత్తం లో నగదు దొరకడంతో…ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.  అమృతరావుతో పాటు ఇంటి యజమాని బిన్నును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చుశారు.

Read more RELATED
Recommended to you

Latest news