కామ ఖాకీ.. మద్యం తాగించి బాలికపై అత్యాచారం..

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. బాధ్యత గల స్థాయిలో ఉండి కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ ఘటనం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అమ‌రావ‌తి జిల్లాలోని ఓ హోట‌ల్‌లో 17 ఏండ్ల బాలిక‌పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగుచూసింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. బాధితురాలు, నిందితుడిది ఒకే గ్రామమ‌ని, వీరిద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంద‌ని తెలిసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాలిక నాగ‌పూర్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. జులై 13న బాలిక‌ను కారులో న‌గ‌రంలో తిప్పిన నిందితుడు ఆమెకు మ‌ద్యం తాగించి ఆపై హోట‌ల్ రూంకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని బెదిరించాడు. మ‌రుస‌టి రోజు ఇంటికి తిరిగివ‌చ్చిన బాలిక జ‌రిగిన విష‌యం కుటుంబ‌స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నాగ‌పూర్ పోలీసులు బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఎస్ఐ (35)ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో స‌హా ప‌లు సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news