కారులో రూ. 5 కోట్లు…

-

తెలంగాణలో పోలింగ్ తేది సమీపిస్తున్న  నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా వరంగల్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై పెంబ‌ర్తి చెక్‌పోస్టు వద్ద మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో తరలిస్తున్న రూ.5కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా రూ. 5 కోట్ల నగదును కారు సీట్ల మధ్యలో పేర్చి తీసుకెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.

దీంతో సంబంధిత వాహనాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ సీపీ రవీందర్‌ జనగామలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశముంది. అనుమానం వచ్చిన కారులోనే రూ.5 కోట్లు దొరికితే..ఇక అన్ని కార్లను తనిఖీ చేస్తే ఎన్ని కోట్లు దొరుకుతాయో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news