వామనరావు మర్డర్ కేసు : కత్తుల కోసం రంగంలోకి డ్రోన్ లు, మాగ్నెట్ లు !

-

తెలుగు రాష్టాలలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన న్యాయవాది వామన్ రావ్ దంపతుల హత్య కేసులు ఎవిడెన్స్ కోసం పోలీసులు తంటాలు పడుతున్నారు. వామనరావును ఆయన భార్యను హత్య చేసిన అనంతరం ఆ కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేశారు. కత్తుల కోసం రెండో రోజులుగా సుందిళ్ల బ్యారేజీలో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

రెండో రోజు ఉదయం నుండి గాలిస్తున్నా కత్తులు లభించలేదు. సుందిళ్ళ బ్యారేజీలోని 58-62 పిలర్స్ మధ్యలో గజ ఈతగాళ్ళు గాలింపు చర్యలు ముమ్మరం చేసినా కత్తులు లభ్యం కావడం లేదు. దీంతో కత్తుల వెలికితీత పోలీసులకు సవాల్ గా మాటింది. కత్తులను  వెలికితీసే ప్రయత్నంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి మరీ పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అలానే మరోవైపు భారీ మాగ్నెట్ ల సహాయంతో కూడా  గాలింపు ముమ్మరం చేశారు. చివరికి కత్తులు చిక్కకుంటే ఏమి చేయాలనే దాని మీద పోలీసుల మల్లగుల్లాలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news