ఓటుకునోటు కేసులో ఏమీ కాదు : క‌న‌క‌మేడ‌ల‌

-

అమరావతి: ఓటుకు నోటు కేసు అసలు కేసే కాదని టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్రకుమార్ అన్నారు. కేంద్రం మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన విమర్శించారు. మోదీ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ధ సంస్థలు మోదీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని కనకమేడల ఆరోపించారు. ప్రధాని కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news