మాకు టికెట్ ఇవ్వకపోతే చుక్కలు చూపిస్తాం – చంద్రబాబుకి ఓ వర్గం నేతలు హెచ్చరిక

-

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. మూడు పార్టీలకు పొత్తు ఉండటంతో యే పార్టీకి టికెట్ ఇవ్వాలో .. ఏ అభ్యర్థిని రంగంలోకి దించాలో టీడీపీకి అర్ధం కావడం లేదు. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో టికెట్ ఫైట్ రోడ్డెక్కింది. తమ సామజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వకపోతే లెక్కలు తేడా వస్తాయని శెట్టి బలిజ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారట.

అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టికెట్ ఎంపిక వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. రామచంద్రాపురానికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఇంచార్జీగా ఉన్నారు. ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం పై ఆ సామజిక వర్గానికి చెందిన నేతలు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసిన సుబ్రహ్మణ్యానికే టికెట్ ఇవ్వలని లేకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారట. వైసీపీ తమకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని .. మూడు mla లు , రెండు mlc లతో పాటు రెండు ఎంపీ , రాజ్యసభ ఇచ్చి గౌరవించిందని టీడీపీ కి లెక్కలు చెబుతున్నారట

మరోపక్క రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం చంద్రబాబు వెన్నుపోటు పై గుర్రుగా ఉన్నారని అయన అనుచరులు చెబుతున్నారు. తనని బాధపెట్టే నిర్ణయాలు తీసుకుంటే పార్టీకే నష్టమని అయన హెచ్చరిస్తున్నారట.. రామచంద్రపురం టికెట్ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news