సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం : ప్రగతి భవన్‌ వద్ద ఓ యువతి హల్చల్

-

దళిత్ ఎంపవర్మెంట్ స్కీం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కాసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కి టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అటు కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాబోమని నిన్ననే తేల్చేసింది బీజేపీ. కానీ సీఎం కేసీఆర్‌ అఖిల పక్షానికి మోత్కుపల్లి హాజరు అయ్యారు. బీజేపీ బహిష్కరించినప్పటికీ మోత్కుపల్లి హాజరైయ్యారు.

ఇది ఇలా ఉండగా..దళిత్ ఎంపవర్మెంట్ స్కీం పై అఖిల పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భవన్ దగ్గర ఓ యువతి హల్చల్ చేసింది. పేదలకు న్యాయం జరగాలి అంటూ నినాదాలతో ప్రగతి భవన్‌ గేటు ముందు తన నిరసన తెలిపింది. తమ సమస్యలు సీఎం కేసీఆర్‌ వినాలి అంటూ ప్రగతి భవన్ ఎంట్రెన్స్ గేట్ దగ్గర కేకలు వేసింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news