ఇండియన్ లాయర్ చేసిన పని చెయ్యడానికి .. ఆస్ట్రేలియా – అమెరికా – లండన్ లాయర్లు కూడా సిద్ధం !

-

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యూహన్ ల్యాబ్ నుండి కావాలని చైనా ప్రపంచం మీదికి వదిలింది అని చాలామంది అంటున్నారు. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాలో ఇన్వెస్టిగేషన్ చేయటానికి పరిశోధనలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలో అనేక మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ ని చైనా ప్రభుత్వం వ్యూహన్ ల్యాబ్ లో దాచిపెట్టి ప్రపంచం మీదకి రిలీజ్ చేసిందని అనేక దేశాల అధినేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.Coronavirus man-made in Wuhan lab, says Nobel laureate - The Weekచాలా మంది చైనా పై కేసు పెట్టాలని అంటున్న తరుణంలో ఇండియన్ లాయర్ చేతల్లో చేసి చూపెట్టారు. ప్రపంచంలో అనేక వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా చైనా ని దోషిగా చూపెడుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక న్యాయవాది ఇండియాకి 190 లక్షల కోట్లకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంటర్నేషనల్ న్యాయస్థానంలో కేసు వేశాడట. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాకేందుకు చైనాయే కారణమన్నది అతని ఆరోపణ. ఆశిష్ సొహనీ అనే లాయర్ కరోనా వైరస్ ని తయారుచేసి దాన్ని కంట్రోల్ చేయకుండా ఇతర దేశాలకు ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేసిందంటూ ఆరోపిస్తున్నాడు.

 

ఈ సందర్భంగా ముప్పై మూడు పేజీల పిటిషన్ ను దాఖలు చేసినట్టు సమాచారం. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కొన్ని కోట్లు నష్టపోతున్నాయి. మందులేని ఈ వైరస్ వల్ల ప్రజలు చనిపోతున్న తరుణంలో లాక్ డౌన్ విధిస్తూ తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా దేశాలు కరోనా వైరస్ వల్ల బాగా నష్టపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ లాయర్ చేసిన పని చేయడానికి… యూరప్ దేశాలు మరియు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ దేశాల లాయర్లు కూడా సిద్ధమవుతున్నట్లు చైనాపై కేసు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news