టీఆర్‌ఎస్‌ గూటికి మరో కీలక నేత.. కండువా కప్పిన హరీష్‌ రావు

-

సిద్దిపేట : మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ ఛైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్, అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ‌ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు‌ తీసుకుంటున్నారని… మత్స్య కారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో మత్స్య కారుల‌ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని… ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపలలో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలిన ఉత్పత్తిలో..21 శాతం పశ్చిమ బెంగాల్ కు , మిగిలిన 19 శాతం చేపలను అస్సాం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతోందని వివరించారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news