ఏపీ ప్రభుత్వానికి సోము కొత్త డిమాండ్ లు, సిఎస్ కు లేఖ…!

-

ఏపీ చీఫ్ సెక్రటరీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాసారు. ఫుడ్ అడ్వైజరీ కౌన్సిల్ మరియు అసైన్‌మెంట్ కమిటీల సభ్యుల సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో రోజువారీ ప్రజల అవసరాలను తీర్చగల సమావేశాలతో ప్రజలకు న్యాయం జరగుతుందని న్నారు. గతంలో గ్రామీణ పేదలకు భూమిని సాగు చేయడానికి అర్హతను నిర్ణయించడానికి కమిటీలను కేటాయించారని ఆయన లేఖలో ప్రస్తావించారు.

రేషన్ సమస్యలను పరిష్కరించడానికి ఆహార సలహా మండలి కమిటీలు కూడా ఉన్నాయని అన్నారు. గత మూడేళ్లుగా ఈ కమిటీలు లేకపోవడంతో, అన్ని పార్టీల ప్రమేయం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఎప్పటి నుంచో అమలులో ఉన్న ఈ సంప్రదాయం ఈ ప్రభుత్వంలో అమలు కాకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసారు. అందువల్ల పేదల ప్రయోజనం కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news