బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం తో పాటుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అమరావతి భూముల వ్యవహారంపై ఏర్పాటుచేసిన సిట్ అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం పై స్టే ఇచ్చింది.

సిట్… టీడీపీ హయాంలో పనులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు పై స్టే ఏపీ హైకోర్టులో టిడిపి నేతలు వర్ల రామయ్య ఆలపాటి రాజా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు… సిట్ ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news