చిన్నప్పటి నుంచి ఆ కొండే చూస్తూ పెరిగా: ఏపీ హోం మంత్రి

-

ఏపి హోం మంత్రి సుచరిత కొండవీటి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. చిన్ననాటి నుండి కొండవీటి కొండ ను చూస్తూ పెరిగానని ఆమె అన్నారు. పైకి వెళ్ళడానికి సరైన దారి ఉండేది కాదని, ఇప్పుడు ఘాట్ నిర్మాణానికి శివారెడ్డి లాంటి వారు కృషి చేశారని చెప్పారు.. చూడదగిన చరిత్ర కలిగిన కోటలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, ప్రస్తుత రోజుల్లో చరిత్రను తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గుతుందని చెప్పారు.

అనేక మంది కవులు కూడా చరిత్రలో ఉన్నారని, కవులు చేసిన గొప్ప కార్యాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చరిత్ర గురించి తెలుసుకునేందుకు వచ్చిన వారికి కూడా సౌకర్యాలు కల్పించేందుకు కూడా కృషి చేస్తామని స్పష్టం చేసారు. అమీనా బాద్ నుండి కొండ పైకి రోడ్డు నిర్మాణానికి కూడా కృషి చేస్తాం అన్నారు. కొండవీడు కోట అభివృద్ధి కి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నే గొప్ప పర్యాటక ప్రాంతంగా కొండవీడు ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news