మంత్రి దేవినేని ఉమకు షాక్.. వైఎస్సాఆర్సీపీలో చేరిన దేవినేని సోదరుడు

-

అధికార టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వైఎస్సాఆర్సీపీ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలే నిదర్శనం. ఏపీ ప్రజలే కాదు.. ఏపీ నాయకులు కూడా జగన్ కు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం నిజంగా మెచ్చుకోదగ్గ పరిణామం.

ఏపీలో అధికార పార్టీ టీడీపీ మంత్రి దేవినేని ఉమకు షాక్ తగిలింది. ఆయన సోదరుడు చంద్రశేఖర్ కు వైఎస్సాఆర్సీపీలో చేరారు. ఇవాళ ఉదయం లోటస్ పాండ్ లో చంద్రశేఖర్ జగన్ ను కలిశారు. వైసీపీ నేత వసంత్ కృష్ణ ప్రసాద్… చంద్రశేఖర్ ను జగన్ తో కలిపించారు.

AP minister devineni Uma brother joins in ysrcp

సినీ నటుడు అలీ వైసీపీలో చేరిన తర్వాత… చంద్రశేఖర్ కూడా జగన్ సమక్షంలో వైఎస్సాఆర్సీపీలో చేరారు. ఈసందర్భంగా జగన్.. చంద్రశేఖర్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఊహించని పరిణామంతో ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు షాక్ కు గురయినట్టు తెలుస్తోంది. ఇది దేవినేనికి ఊహించని షాక్ అని.. టీడీపీకి రోజురోజుకూ కోలుకోలేని దెబ్బలు తాకుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా ఒక నెల ఉన్న నేపథ్యంలో వైఎస్సాఆర్సీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి పలు ముఖ్య నేతలు వైసీపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news