బ్రేకింగ్; టీడీపీ సీనియర్ నేతపై దాడి, పరిస్థితి ఉద్రిక్తం…!

-

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి దీక్షా శిభిరం వద్దకు వద్దకు వచ్చిన డెల్టా టైగర్, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. అమరావతి దీక్ష శిబిరం వద్దకు వచ్చిన రాజా పై కోడి గుడ్లు, టమాటో లతో దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దీనితో రాజాకు అడ్డంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు. ఈ క్రమంలో అడ్డుగా నిల్చున్న పలువురు కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నేపధ్యంలో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత ప్రజలు దీక్షలు, నిరసనలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

దీక్షా శిభిరం వద్దకు వచ్చి వైసీపీ కార్యకర్తలు బైక్ తో చక్కర్లు కొట్టారు. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్దం చేసారు. శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతు గా నినాదాలు చేయడంతో జెఎసి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలు కూడా జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. దీనితో అక్కడికి చేరుకున్న రాజా ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news