బ్రేకింగ్: రేషన్ షాపు గొడవ, కాల్చి చంపేసిన బిజెపి నేత…!

-

ఒక రేషన్ షాపు విషయంలో వచ్చిన గొడవలో బిజెపి నేత ఒకరు ఉత్తరప్రదేశ్ లో రెచ్చిపోయారు. తన తుపాకికి ఆయన పని చెప్పారు. గురువారం బల్లియాలో రియోటి ప్రాంతంలోని దుర్జన్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో రేషన్ షాపుల కేటాయింపుపై తీవ్ర వాదన జరిగింది. ఈ గొడవలో ఒక వ్యక్తిని బిజెపి నేత స్పాట్ లో కాల్చేశారు.

రేషన్ షాపుల ఎంపిక కోసం పంచాయతీ భవన్‌ లో ఒక సమావేశం జరిగింది. చినికి చినికి గాలి వానగా ఆ వివాదం మారడం… స్వయం సహాయక బృంద సభ్యుల మధ్య వివాదం కారణంగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమావేశాన్ని రద్దు చేయడంతో ఆగ్రహం ఆపుకోలేక… 46 ఏళ్ల జే ప్రకాష్ పాల్ కాల్పులు జరిపారు. ఆ తర్వాత అల్లర్లు కూడా చెలరేగడంతో… స్థానిక పోలీసులు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మరియు సిఐ కూడా అక్కడే ఉన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా, పోలీసుల ఫిర్యాదులో 20 మందిని జాబితా చేశారు. ఆ ప్రాంత పోలీసులు అందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news