ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం

-

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్​ చేశారు.

పోలీసుల తోపులాటలో ఓ బీజేపీ కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను అరెస్ట్​ చేశారు. భాజపా నేతల ప్రకటన దృష్ట్యా కవిత ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నగర కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఒక్కసారిగా భాజపా కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలను తిప్పికొట్టేందుకు తెరాస కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news