మిలియ‌న్ మార్చ్ కు సిద్ధం అవుతున్న బీజేపీ

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పై బీజేపీ మ‌రో పోరాటానికి సిద్ధం అవుతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ స‌మ‌స్య పై తమ గ‌ళం విప్పాల‌ని చూస్తుంది. దాని కోసం ఈ నెల 16న నిరుద్యోగ మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హించాల‌ని భావిస్తుంది. ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష‌డు బండి సంజ‌య్ అన్నాడు. ఈ రోజు హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ల చిక్క‌డ‌ప‌ల్లి లో ఉన్న సెంట్ర‌ల్ లైబ్ర‌రీ కి బండి సంజ‌య్ వెళ్లాడు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న నిరుద్యోగుల‌తో బండి సంజ‌య్ మాట్లాడారు. అనంత‌రం ముఖ్య మంత్రి కేసీఆర్ పై మండి ప‌డ్డాడు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో గ‌డ‌ప‌డానికి ముఖ్య మంత్రి ప‌ద‌వి ఇవ్వ లేమ‌ని అన్నారు. కేసీఆర్ నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. మిలియ‌న్ మార్చ్ తో కేసీఆర్ పొగ‌రును దించుతామ‌ని అన్నారు. బీజేపీ నిర్వ‌హిస్తున్న మిలియ‌న్ మార్చ్ విజ‌య‌వంతం చేయాల‌ని నిరుద్యోగుల‌ను కోరాడు.

Read more RELATED
Recommended to you

Latest news