ఎంత మంది బలిదానం చేసుకుంటే నీ కళ్ళు చల్ల బడుతాయి : బండి సంజయ్

-

ఎంత మంది బలిదానం చేసుకుంటే ని కళ్ళు చల్ల బడుతాయని సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చిక్కడ పల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా నిరుద్యోగులతో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ కి వెళ్లారు సంజయ్.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతు.. యువత ఉద్యమం కోసం బలిదానం చేసుకుంది… ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకోవాల్సి వస్తుందన్నారు. నోటిఫికేషన్స్ గురించి మాట్లాడకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం మేము ఉద్యమం చేయడం లేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎం మాట్లాడినవ్ …ఇప్పుడు ఏమి చేస్తున్నావని నిప్పులు చెరిగారు.

నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుంది… ఎవరు ఆత్మహత్య లు చేసుకోవద్దు.. తల్లి దండ్రులకు బాధ పెట్టొద్దన్నారు. పక్క రాష్ట్రము ఏమి చేస్తుంది… కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని అడగడం కాదు.. నువ్వేమి చేసావో చెప్పు ఆన్ కెసిఆర్ ను నిలదీశారు.ప్రగతి భవన్ లో, ఫార్మ్ హౌస్ లో ఉండడానికి కాదు నిన్ను ముఖ్యమంత్రి ని చేసిందని మండిపడ్డారు. ఈ నెల 16 న నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిరహిస్తామన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news