బొత్స చెప్పారంటే వైసీపీలో అది వేదవాక్కు: బుద్ధా వెంకన్న

-

ఆంధ‌్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కలిసి పని చెయ్యాలని, జగన్‌ ప్రభుత్వంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, మొన్నామధ్య జగసేన-బీజేపీలు మాట్లాడుకున్నాయి. కానీ ఇంతవరకూ ఉమ్మడి కార్యక్రమం పట్టాలెక్కలేదు. ఈ క్ర‌మంలోనే బుద్ధా వెంకన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. బొత్స గారు చెప్పారంటే అది వైకాపాలో వేదవాక్కేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్టు మొదట చెప్పింది బొత్స గారేనని… ఇప్పుడు ఎన్డీయేలో వైసీపీ కలవబోతోందని బొత్స చెప్పారని తెలిపారు.

అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామన్న జగన్ గారు ఇప్పుడు కేంద్రం ముందు ఎందుకు మోకరిల్లారో బొత్స గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసుల మాఫీ కోసమా? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండేందుకా? దేని కోసం ఎన్డీయే లో చేరుతున్నారు? ఈ ప్రశ్నలకు బొత్స సమాధానం చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. తల వంచి, కాళ్లు పట్టుకొని ఎన్డీయేలో చేరి సాధించబోయేది ఏంటో బొత్స గారు వివరించాలని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news