చంద్రబాబు ఇది చేస్తే చాలు…?

-

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం గెలవడం పక్కన పెడితే కొన్ని అంశాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించింది అనే భావన ఉంది. ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా వరకు కలిసి పనిచేయడం లేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ అభిప్రాయం దాదాపుగా మారింది. చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ తిరుపతి ఉప ఎన్నికల కోసం కష్ట పడుతున్నారు.

పార్టీ విజయం కోసం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న పరిస్తితి. రాజకీయంగా ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇప్పుడు కష్టపడటం పార్టీ కార్యకర్తలను కాస్త సంతోషాన్ని గురిచేస్తున్న అంశం గా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తిరుపతి ఉప ఎన్నికల కోసం చాలామంది నాయకులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కష్ట పడ్డారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం తిరుపతి పార్లమెంటు పరిధిలో పని చేయడానికి ఆసక్తి చూపించలేదు. కాబట్టి వాళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news