“వాళ్ళు లేకపోతే చంద్రబాబు అడుగు కూడా వేయలేడు” నిజమా ?

-

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చీలిక వస్తుందని షాకింగ్ కామెంట్ చేశారు. చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి లో వైసీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…వయసు పెరిగి పోయిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదని పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుండి కియా మోటార్స్ వెళ్లి పోతున్నట్లు చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Image result for chandrababu

త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చీలిక రాబోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బతుకంతా గ్రాఫిక్స్ చూపిస్తూ బతకటమే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అబద్ధపు వార్తలు రాయించి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని అసలు రాష్ట్రానికి చంద్రబాబు ఎటువంటి పరిశ్రమను తీసుకు వచ్చారో ఎన్ని తెచ్చారు అన్ని లెక్కలు బయట పెట్టాలని కోరారు. చంద్రబాబు లో భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

రాజకీయంగా ఆందోళన కూడా చంద్రబాబులా కనిపిస్తుంది అని ఇందువల్లనే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచి పనులను ఓర్చుకోలేక పోతున్నారని విమర్శించారు. కావాలని బురదజల్లే మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని జెడ్ ప్లస్ భద్రత లేకుండా చంద్రబాబు ఒక్క అడుగు కూడా బయటకు వెళ్లారని ప్రజలలో చంద్రబాబుపై ఇంకా తీవ్రమైన వ్యతిరేకత ఉందని వాళ్లు లేకుండా ఒక్క అడుగు వేయగలరా చంద్రబాబు అంటూ శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రం నుండి ఎలాంటి పరిశ్రమ వెళ్లలేదని దమ్ముంటే తనతో చర్చకు రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news