కెసిఆర్ తో ట్రంప్ కరచాలనం, ఫోటో వైరల్…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఆయనకు రాష్ట్రపతి… తన భవన్ లో విందు ఏర్పాటు చేసారు. ఈ విందుకి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటుగా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు అందరికి ట్రంప్ కరచాలనం చేసారు.

కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరు అయ్యారు. వెంకయ్య సతీసమేతంగా వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరితో ట్రంప్ ఆప్యాయంగా మాట్లాడటం గమనార్హం. ఈ విందులో ప్రత్యేక వంటలు ఏర్పాటు చేసారు.

ట్రంప్ దంపతులకు రామనాథ్ కోవింద్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవనం విశిష్టతలను ట్రంప్ కి కోవింద్ వివరించారు. అమెరికా బృందాన్ని రాష్ట్రపతికి ఉప రాష్ట్రపతికి పరిచయం చేసారు. త్వరలోనే భారత్ కి వస్తాను అన్నారు ట్రంప్. ఈ రాత్రి 10 గంటలకు ట్రంప్ అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నారు. నిన్న ఉదయం ఆయన భారత్ కి వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news