రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్ మంత్ర‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని విజ్ఞాప్తి చేస్తూ రేపు చివ‌రి ప్ర‌య‌త్నం గా రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. త‌న తో పాటు మంత్రులు అంద‌రూ కూడా ఢిల్లీ కి వ‌స్తార‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యే లు, ఎంపీ లు కూడా ఢిల్లీ కి వ‌స్తార‌ని తెలిపారు. తెలంగాణ వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి ని క‌లుస్తామ‌ని తెలిపారు. అలాగే వీలు అయితే ప్ర‌ధాన మంత్రి ని కూడా క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తామ‌ని తెలిపారు.

అలాగే వారిని తెలంగాణ లో వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తామ‌ని తెలిపారు. అలాగే తాము ఇప్ప‌టి వ‌ర‌కు చాలా డిమాండ్ ల‌ను కేంద్రం ముందు పెట్టామ‌ని గుర్తు చేశారు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఉలుకు ప‌లుకు లేద‌ని అన్నారు. అందుకే చివ‌రి ప్ర‌య‌త్నంగా ఢిల్లీ కి వెళ్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అక్క‌డ కేంద్రం స్పంధ‌న చూసి త‌మ భ‌విష్యత్తు ప్ర‌ణాళిక ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news