ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ.. పొంగులేటి గుడ్‌బై

-

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులకు డబ్బే ముఖ్యం.. అందుకే అభ్యర్థుల ఎంపికలోనూ డబ్బునే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారన్నారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే ఇక. ఎందుకంటే.. ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రస్తుతం వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి, అసెంబ్లీ సీఎప్పీ నాయకుడు భట్టి విక్రమార్క తప్పితే.. ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులే లేరు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు పార్టీని వీడి టీఆర్‌ఎస్, బీజేపీ లాంటి పార్టీలో చేరారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

congress leader ponguleti resigned to congress

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులకు డబ్బే ముఖ్యం.. అందుకే అభ్యర్థుల ఎంపికలోనూ డబ్బునే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారన్నారు. దీంతో తాను కాంగ్రెస్ వీడుతున్నట్లు తెలిపారు. అయితే.. ఆయన ఏ పార్టీలో చేరేది మాత్రం ఇంకా తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news