సీఎం జగన్‌కు చెప్పు చూపించి మ‌రీ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు

-

అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సుంకర పద్మశ్రీ… చెప్పు చూపిస్తూ.. చెప్పు తెగుతుంది జగన్మోహన్ రెడ్డి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తుళ్లూరు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధానిలో నివసిస్తున్న మహిళలు.. డబ్బులు ఎక్కువై, ఇళ్లల్లో పేకాట స్థావరాలు నడిపిస్తున్నారని.. వాటిని సీఎం జగన్ మూయించడంతోనే .. రోడ్లపైకి వచ్చారంటూ వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

ఈరకమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. చెప్పు చూపిస్తూ.. ‘‘చెప్పు తెగుతుంది జగన్మోహన్ రెడ్డి.. ఏం చేసుకుంటావో చేసుకో.. ఎన్నికేసులు పెట్టుకుంటావో పెట్టుకో భయంలేదు.. తెలుగింటి ఆడపడుచులపైన, మహిళల పైన.. తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్’’ అంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news