సి‌ఎం పీఠం దద్దరిల్లుతోంది .. ఊడిపోయేలా ఉంది !

-

దేశంలోనే ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి  స్థానం లో ఉంది. దేశంలో వైరస్ వచ్చిన నాటి నుండి మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుంది కానీ మరో పక్క మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనేక విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పనితనం ఏమీ బాగోలేదు అని ప్రతిపక్షాల నుండి విమర్శలు తారాస్థాయిలో వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టు ఊడిపోయేలా గండం వచ్చి పడింది.Coalition affair Leave me Uthav Thakre advises MPs || தொகுதி ...పూర్తి మేటర్ లోకి వెళ్తే ఉద్దవ్ ఠాక్రే శాసన సభ, మండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే సీఎంగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా గాని, ఎమ్మెల్సీగా గాని ఎన్నికవాల్సిన అవసరం ఉంది. మే 28 నాటికి ఆరు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఎమ్మెల్సీగా గాని మే 28 లోపు ఎన్నికైతే సీఎం పోస్ట్ ఉంటుంది లేకపోతే ఊడిపోతుంది.

 

ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తూ ఉంది. ఇటువంటి టైం లో పార్టీకి సంబంధించిన వేరే వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎలక్షన్ పెట్టడానికి… ఎన్నికల కమిషన్ ముందుకు రాదు. దీంతో కరోనా వైరస్ దెబ్బకీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పీఠం దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి చూస్తే మే లోపు ఉద్దవ్ ఠాక్రే సీఎం పీఠం ఊడిపోవడం గ్యారంటీ అని చాలామంది అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news