వరంగల్‌ పర్యటనలో కేసీఆర్‌ : కరపత్రాలు కలకలం

-

వరంగల్ అర్బన్ జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే… సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం రేపాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్ గా కరపత్రాలు మారాయి. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘటగా లేఖలో పేర్కొన్న ఆగంతకుడు.. న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పు లో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేశారు. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు విడుదల అయ్యాయి.

 

మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ బి ఫారం లు 50 లక్షలకు అమ్ముకున్నడాని, గతంలో ములుగు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వాసులు చేసాడని లేఖలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. వరంగల్ తూర్పులో బుకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ అంటూ ఘాటుగా ఆరోపణలు చేసిన ఆగంతకులు…వరంగల్ లో సీఎం పర్యటన సందర్భంగా పోలీసు తీరు పైన విమర్శలు వెళ్లువెత్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. సీఎం పర్యటన చేసే రహదారిలో ఉన్న పోలీసులు షాపులను మూసివేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news