పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదు: రోజాపై దివ్యవాణి సెటైర్లు

-

న‌గ‌రి ఎమ్మెల్యే రోజా నేడు మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ‘దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప ఆలోచనలతో జగన్‌ పథకాలు అమలు చేస్తున్నారు. తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు తీరు ఉంది. ఆయ‌న‌ జగన్‌పై బురద ఎలా చల్లాలనే విషయంపై భూతద్దాలతో వెతుకుతున్నార‌ని రోజా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఐటీ సోదాలను డైవర్ట్‌ చేయడానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. వారు జీవితాంతం జైల్లో ఉంటారు. ప్రకాశం జిల్లాలో మైనింగ్‌ అక్రమాలలో మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు.ఖ‌చ్చితంగా వీరు చేసిన తప్పులకి జైలుకు వెళ్లే అవకాశం ఉంది అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు రోజా.

దీంతో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు టీడీపీ నేత దివ్యవాణి స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని అన్నారు. రోజా భజన కార్యక్రమాలు నిలిపివేసి ప్రజాసమస్యలను సీఎం ముందుంచాలని హితవు పలికారు. అయినా పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదని రోజాకు చురకలంటించారు. సినీ పరిశ్రమ తలదించుకునేలా రోజా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సొంత నియోజకవర్గ ప్రజలే రోజాను అసహ్యించుకుంటున్నారని దివ్యవాణి విమర్శ‌లు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news