కేసులు ఎన్ని పెట్టినా “తగ్గేదేలే” : ఈటల రాజేందర్

-

తెలంగాణ ప్రభుత్వంపై మరియు సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన డైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడారు. ఈయన మాట్లాడుతూ ఇప్పటికి తెలంగాణాలో రెండు పర్యాయాలుగా కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్నారు… ఈ ఎనిమిది సంవత్సరాలలో BRS కు వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో చెప్పాలని ఒకప్పుడు TRS లోనే మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గట్టిగా నిలదీశారు. కేవలం ఈ ఎనిమిది సంవత్సరాలు రాష్ట్రంలోని అని మార్గాలలోనూ డబ్బులు సంపాదించి వేలకోట్లను వెనకేసుకున్నారంటూ ఉదహరించారు, ముఖ్యంగా ఇసుక మరియు మద్యం ద్వారా కోట్ల డబ్బును BRS నాయకులు కొల్లగొడుతున్నారంటూ రెచ్చిపోయి అడిగారు.

ఇంకా రాష్ట్రంలోని అసైన్డ్ భూములను దోచుకుని అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని డిమాండ్ చేశారు. వీటిని ప్రశ్నించినందుకు బీజేపీ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేదేలే అంటూ రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news