ఏపీ ఎన్నికలు: ఓ ఈవీఎంలో అదనంగా 50 ఓట్లు.. ఎమ్మార్వో సస్పెండ్

-

ఏపీలోని కృష్ణా జిల్లాలో మొన్న జరిగిన ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకున్నది. నూజివీడులోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటేసిన ఓటర్లకు, పోలైన ఓట్లకు మధ్య 50 ఓట్ల వ్యత్యాసం వచ్చింది. పోలింగ్ రోజున ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించిన పోలింగ్ అధికారులు.. ఆ ఓట్లను ఈవీఎం నుంచి తొలగించడం మరిచిపోయారు.

evm got 50 extra votes in nuziveedu polling booth

దీంతో ఆ ఈవీఎంలో 50 ఓట్లు అదనంగా పడ్డాయి. దీనిపై విచారణ చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు ఆ పోలింగ్ బూత్‌కు బాధ్యత వహించే నూజివీడు ఎమ్మార్వో తేజేశ్వరరావును సస్పెండ్ చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని సబ్ కలెక్టర్‌తో పాటు పోలింగ్ అధికారులపై ఈసీ మండిపడింది. దీంతో ఇది ఏపీలో చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news