ఎం‌ఐ‌ఎం అడ్డాలో ఈ సారి ఫిరోజ్ హవా ఉంటుందా?

-

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎం‌ఐ‌ఎం పార్టీకి కంచుకోటలుగా ఉన్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఆ నియోజకవర్గాల్లో ఎం‌ఐ‌ఎం హవా కొనసాగుతూనే వస్తుంది. ఆ నియోజకవర్గాల్లో మరో పార్టీ గెలవడం చాలా కష్టమైపోతుంది.మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్, ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ఎం‌ఐ‌ఎంకి తిరుగులేని బలం ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపు ఆపడం వేరే పార్టీలకు చాలా కష్టం. పైగా అధికార టి‌ఆర్‌ఎస్ సైతం ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏదో నామ మాత్రంగానే పోటీలో ఉంటుంది.

అంటే పరోక్షంగా ఎం‌ఐ‌ఎం గెలుపుకి టి‌ఆర్‌ఎస్ సహకరిస్తూ ఉంటుంది. దీంతో ఎం‌ఐ‌ఎంకి తిరుగులేని విజయాలు దక్కుతున్నాయి. అయితే ఎం‌ఐ‌ఎంకి పోటీ ఇవ్వడానికి బి‌జే‌పి గట్టిగానే ప్రయత్నిస్తుంది గానీ, పెద్దగా సక్సెస్ కాలేదు. భారీ మెజారిటీల తేడాతో ఎం‌ఐ‌ఎం మీద బి‌జే‌పి ఓడిపోతూ వస్తుంది. కానీ ఆ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క నాంపల్లిలో మాత్రమే ఎం‌ఐ‌ఎంకి ప్రతిసారి గట్టి పోటీ ఎదురవుతూ ఉంటుంది. అలా ఎం‌ఐ‌ఎంకి పోటీ ఇచ్చేది కూడా ఒక్క మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ మాత్రమే. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఫిరోజ్, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఎం‌ఐ‌ఎంకి కాస్త పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు.

ఇక 2018 ఎన్నికలోచ్చేసరికి ఫిరోజ్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎం‌ఐ‌ఎం అభ్యర్ధి జాఫర్ హుస్సేన్ చేతిలో 10 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఈ సారి ఎలాగైనా ఇక్కడ ఎం‌ఐ‌ఎంకి చెక్ పెట్టాలని ఫిరోజ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక ఎం‌ఐ‌ఎం స్థానాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తమకు పట్టున్న నాంపల్లిలో ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. మరి చూడాలి ఈ సారి ఎం‌ఐ‌ఎం అడ్డాలో ఫిరోజ్ హవా ఉంటుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news