నేతన్న కార్మికులకు గుడ్ న్యూస్… కెటిఆర్ కీలక ప్రకటన

-

తెలంగాణ రాష్ర్టంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్టంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల పొదుపుకు అదనంగా ప్రభుత్వం తన వాటాను జమచేస్తుందన్నారు. చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటకు రెట్టింపు వాటాను 16శాతాన్ని ప్రభుత్వం జమ చేస్తుందని, దీంతోపాటు మరమగ్గ కార్మికుల చేసే 8 శాతం వేతన వాటకు సమానంగా మరో 8శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని మంత్రి అన్నారు. రాష్ర్టంలో ఉన్న సూమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు ఫథకం భరోసాను ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాకముందుకు కేవలం చేనేతలకే ఉన్న ఈ పథకాన్ని విస్తరించి పవర్ లూమ్ కార్మికులకు కూడా ఈ పొదుపు సౌకర్యం కల్పించామన్నారు. దీంతోపాటు గతంలో కేవలం సోసైటీల పరిధిలో ఉన్న చేనేతలకు ఈ పథకం ఉండేదని, ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడితోపాటు డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు , మరియు ఇతర చేనేత పనివారు కూడా ఈ పథకంలో చేరవచ్చన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు చేనేతలకు ప్రభుత్వం జమచేసే వాటా కేవలం 8శాతమే అని, దీన్ని తాము రెట్టింపు చేసి 16 శాతానికి పెంచామని (కార్మికుడి పొదుపు రెట్టింపు) మంత్రి కేటీఆర్ తెలిపారు.

 

ఈ పథకం కరోనా కాలంలో నేతన్నలకు ఎంతో ఉపయుక్తంగా నిలించిందని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో నేతన్నలు తమకు ప్రయోజనాలను నిర్ణీత లాకిన్ పిరియడ్ కన్నా ముందే పొందేలా వెసులు బాటు ఇచ్చామని దీంతో రాష్ర్టంలోని నేతన్నలకు సూమారు 103 కోట్ల రూపాయాల మేర ప్రయోజనం కలిగిందన్నారు. ఇంతటి ప్రయోజకారి అయిన పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని నేతన్నలు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఈరోజు పథకం కొసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కొనసాగించేందుకు అవసరం అయిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. రాష్ర్టంలోని నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వ కట్టుబడి ఉన్నదన్న మంత్రి కేటీఆర్, ఈ నేతన్నకు చేయూత పొదుపు పథకంలో నేతన్నలంతా చేరాలని విజ్ఝప్తి చేశారు.ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యార్, టెక్స్ టైల్ శాఖా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news