ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది : హరీష్

-

జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడింది. అయిప్పటికీ ఇప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బిజెపి పార్టీ ధర్నా నిర్వహించడం పై స్పందించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ బిజెపిపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకొని బీజేపీ నాలుగు ఓట్లు సాధించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

అయితే జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఏకంగా ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దలందరూ హైదరాబాద్లో వాలిపోయారని.. ప్రచారం నిర్వహించాల్సి ఉంది బడాబడా నేతలతో కాదు ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచే విధంగా ప్రచారం ఉండాలి అంటూ సూచించారు. బీజేపీ మాత్రం దీనికి విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తోంది అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news