ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ హైకోర్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై గత సంవత్సరం వేసిన 2 పిటిషన్స్ పై నేడు హైకోర్టు లో విచారణ జరిగింది. కోవిడ్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున ఎన్నికలు షెడ్యూల్ ఇచ్చి వాయిదా వేశామని ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

కోవిడ్ వల్ల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని ప్రభుత్వం పేర్కొంది. ఆ మాట రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలని అని వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఎన్నికల సంఘానికి నోటీస్ లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2 కు వాయిదా వేసింది హైకోర్టు. అయితే హైకోర్ట్ కి ఎవరూ రాకపోవడంతో నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news