బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యేకు హైకోర్ట్ నోటీసులు

-

వేమూరు నియోజకవర్గం లో అధికార పార్టీ అక్రమ మైనింగ్ పై హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు న్యాయవాది అరుణ్ సౌరీ వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు లు అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసారు. భట్టిప్రోలు మండలం ఓలేరు లో 1924 నుంచి 170 ఎకరాలను దళితులు సాగు చేసుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఆది ఆంధ్ర కోపరేటివ్ సొసైటీ పేరుతో దళితులు ప్రభుత్వానికి శిస్తూ కడుతున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. 12 ఎకరాల దళితుల సొసైటీ భూములలో మైనింగ్ చేస్తున్నారని వివరించారు. జిల్లా అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. సొసైటీ తరుపున హైకోర్టు లో పిటిషన్ వేశాం అన్నారు. ఎమ్మెల్యే నాగార్జున, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు లకు హైకోర్టు నోటీసులు ఇచ్చిందని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news