ఎటు చూసినా జనమే.. జగన్ సభలకు ఇసుకేస్తే రాలనంత జనం

-

జనం జనం ప్రభంజనం….ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.ఏపీలో ఎక్కడ యాత్ర చేసిన ప్రజలు స్వచ్ఛందంగా ప్రభంజనంగా తరలివస్తున్నారు.దీంతో రాష్ట్రంలో వైసీపీ గాలి బలంగా వీస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది.ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు ప్రజలు లక్షల్లో విచ్చేస్తున్నారు.జగన్ కి అండగా నిలిచి మళ్లీ మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.జగన్ కి ఎక్కువగా బలముండే రాయలసీమలోనే ఆయనకు ఆదరణ ఎక్కువ అనుకుంటే ఇప్పుడు రాయలసీమను మించి గుంటూరు,కృష్ణా జిల్లాల ప్రజలు అభిమానము చూపిస్తున్నారు.

 

సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన తర్వాత కేసరపల్లిలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు.అనంతరం 15వ రోజు గన్నవరంలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఆయన అడుగు పెట్టిన దగ్గర నుండి జనం ప్రభంజనంలా పెరుగుతూ వస్తున్నారు.జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. ఎక్కడ చూసినా బారులు తీరి ఆయనకు జై కొడుతున్నారు.ఇంకో పక్క అల్లయ్యన్స్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ఎక్కడా ఇంత జనబలం కనపడట్లేదు. వాళ్ళ సభలకు డబ్బులు పెట్టి మరీ జనాన్ని తరలించినా స్పందన కనిపించడం లేదు.దీంతో జననేతపై భౌతిక దాడులు చేసేందుకు కూడా ప్రతిపక్షాలు వెనుకాడటం లేదు. ఎన్ని అవరోధాలు సృష్టించినా మళ్లీ వైసీపీ హవా తప్పదని ప్రజలు అంటున్నారు.

ఇక జగన్ పై ప్రజాభిమానం చూస్తుంటే మరోసారి ఏపీలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్ స్వర్ణయుగం కేవలం జగనన్నతోనే సాధ్యమని అంటున్నారు.మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదని ఈసారి మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు జగనన్న ప్రణాళిక సిద్ధం చేసారని చెప్పుకుంటున్నారు. టీడీపీ సహా మిగతా రాజకీయ పార్టీలకు ఏపీలో కనుమరుగుకాక తప్పదని ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కురుక్షేత్రంలో అర్జునుడి లాగా జగన్ ఈసారి కూడా భారీ విజయం సాధిస్తారని దీనిని ఆపడం ఎవ్వరితరం కాదని తేల్చిచెప్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news