చంద్రబాబు దగ్గరకి వస్తున్న ఐటీ ?? అసలేం జరుగుతోంది ఏపీ లో ?

-

గత కొన్ని రోజుల నుండి ఇటీవల దక్షిణాదిలో ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మరియు సినిమా రంగంలో ప్రముఖుల ఇళ్లపై టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు దాడులు మరియు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ ఐటీ దాడుల నిర్వాకం జరుగుతున్నట్లు ఏపీ మీడియా వర్గాల వార్తలు వస్తున్నాయి.

Image result for chandrababu

విషయంలోకి వెళితే 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టిడిపి అధినేత చంద్రబాబు కి పర్సనల్ అసిస్టెంట్ గా పీఏ గా పనిచేసిన శ్రీనివాస చౌదరిపై ఐటీ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో దర్యాప్తులో దాదాపు 150 కోట్ల మేరకు ఆస్తి విలువ ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

అంతేకాకుండా ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ లా ఇళ్లల పై ఏకకాలంలో భారీ బందోబస్త్ సెక్యూరిటీ నడుమ ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో దాడులు నిర్వాకం చూస్తూ ఉంటే కచ్చితంగా చంద్రబాబు ని టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు జరుగుతున్నట్లు రాజకీయ మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news