పొత్తా? విలీనమా?… నేడు బీజేపీ నేతలతో పవన్‌ కీలక భేటీ..

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ‌్యంలోనే మరో సారి పొత్తుల రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఇక తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలతో, జనసేన నేతల కీలక సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఈ వారం ప్రారంభంలో రెండు రోజుల పాటు హస్తినలో మకాం వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన సంగతి తెలిసిందే. జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి, పార్టీని అధికారానికి దగ్గరగా తీసుకుని వెళ్లాలని నడ్డా కోరినట్టు వార్తలు వచ్చాయి.

దీనిపై అప్పటికప్పుడు ఎటువంటి సమాధానాన్నీ చెప్పని పవన్ కల్యాణ్, 2024లో వచ్చే ఎన్నికల వరకూ కలిసి పని చేద్దామని కోరారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇరు పార్టీల భవిష్యత్ వ్యూహాలపై చర్చించేందుకు విజయవాడ వేదికైంది. జనసేన తరఫున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున కన్నా లక్ష్మీ నారాయణ, జీవీఎల్, సునీల్ దేవధర్ హాజరు కానున్నారు. స్థానిక ఎన్నికల్లో పొత్తు, రాజధాని అంశం, ప్రజా సమస్యలపై ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలపై ఇరు పార్టీల మధ్యా చర్చలు జరగనున్నాయని తెలుస్తుండగా, బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేయడం, అందుకు విధివిధానాలపై నేతలు మాట్లాడుకోనున్నారని జనసేనలోని ఓ వర్గం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news