వారిపై పరువునష్టం దావా వేస్తానంటున్న‌ జ‌న‌సేన‌..?

-

అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. అమరావతి రైతుల ఆందోళన, మూడు రాజధానుల విషయమై ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అమరావతిలో ఆయనకు 62 ఎకరాల భూమి ఉందని.. అందుకే ఆయన అక్కడే రాజధాని ఉండాలని బలంగా వాదిస్తున్నారనేది ఆ ప్రచారం సారాంశం. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన వర్గాలు మండిపడ్డాయి.

పవన్ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది. ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని అల్పులే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news