బద్వేల్ ఉప ఎన్నిక కు దూరంగా నుంచి జనసేన..

-

కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గం ఉప ఎన్నిక అక్టోబర్‌ 30న జరుగనున్న తెలిసిందే. అయితే.. ఈ పోరులో ఇప్పటికే వైసీపీ మరియు టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా… తాజాగా జనసేన పార్టీ కూడా పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చింది.

బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపబోమని ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చిందని…అందుకే బద్వేలు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలవడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన బహిరంగ సభలో ఈ విషయాన్ని తెలియజేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందిన ఉప ఎన్నిక వచ్చిందని మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసిపి టికెట్ ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక అటు బీజేపీ పార్టీ…. పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ముగ్గురి పేర్లు… తెరపైకి రాగా.. రేపటి లోగా అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news