చంద్రబాబుని చంపి ముక్కలు చెయ్ జగన్…!

-

చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన్ను చంపి ముక్కలు చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని ప్రాంతంలో శనివారం పర్యటించిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి జేసీ సంచలన వ్యాఖ్యలు చేసారు. కసి ఉంటే చంద్రబాబు మీద తీర్చుకోవాలని గాని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టవద్దని జేసి కోరారు.

అంతకు ముందు ఆయన మాట్లాడుతూ… అమరావతిలో చంద్రబాబుకు కూడు భూములు ఉన్నాయని చంద్రబాబుకి అమరావతిలో భూములు లేవనడం పూర్తిగా అబద్దమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కమ్మవారికి ఏదో మేలు చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, చంద్రబాబు కమ్మ జాతిని పూర్తిగా నాశనం చేశారని… కృష్ణా గోదావరిలో కలిపేశారని జేసి వ్యాఖ్యానించారు.

రైతులు చేస్తున్న దీక్షా శిభిరానికి జేసి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ, అక్క అనడంతో అందరూ జగన్‌కు ఓటేశారన్న జేసీ… ఇప్పుడు ఆయన కారణంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని జగన్‌కు ప్రజలు ఓటేస్తే ఆయన తమకు నరకం చూపిస్తున్నాడని జేసి వ్యాఖ్యానించారు. జగన్ మారాలంటే మళ్లీ ఆయన తాత రాజారెడ్డి దిగిరావడమో లేక కోర్టులు కలుగజేసుకోవాలని జేసి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news