కేఏ పాల్ ఓ కామ‌పిశాచి.. యాంక‌ర్ శ్వేతా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణలు..

-

కేఏ పాల్‌కు చెందిన ప్ర‌జాశాంతి పార్టీలో చేరిన యాంక‌ర్ శ్వేతా రెడ్డి గ‌త కొద్ది రోజుల కింద‌టే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బ‌య‌టకు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు కేఏ పాల్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తోంది. ఇటీవ‌లి కాలంలో అనేక సార్లు మీడియాతో మాట్లాడిన శ్వేతా రెడ్డి పాల్‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. ఈ క్రమంలోనే ఆమె మ‌రోసారి పాల్‌పై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించింది. పాల్ ఓ కామ పిశాచి అని సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసింది.

కేఏ పాల్ ఓ కామ పిశాచి అని, అమ్మాయిల‌పై చేతులు వేసి వారిని తాక‌రాని చోట తాకుతార‌ని యాంక‌ర్ శ్వేతా రెడ్డి ఆరోపించింది. అనంతపురం ప‌ర్య‌ట‌న‌లో ఒక‌సారి త‌న‌తో పాల్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అప్పుడే అత‌నికి వార్నింగ్ ఇచ్చాన‌ని, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే తాట తీస్తాన‌ని పాల్‌ను హెచ్చ‌రించాన‌ని ఆమె చెప్పుకొచ్చింది. అయితే త‌న వార్నింగ్‌కు భ‌య‌ప‌డిన పాల్ అప్ప‌టి నుంచి త‌న జోలికి రాలేద‌ని, అయినా ఇత‌ర మ‌హిళ‌ల‌తో మాత్రం త‌న అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌ను పాల్ కొన‌సాగించాడ‌ని శ్వేతా రెడ్డి ఆరోపించింది. అలాగే త‌న‌కు హిందూపురం టిక్కెట్టు ఇస్తాన‌ని పాల్ హామీ ఇచ్చార‌ని, అందుకు త‌న‌ను డ‌బ్బులు అడిగాడ‌ని, తాను ఇవ్వ‌క‌పోయేస‌రికి త‌న‌కు టిక్కెట్టు నిరాక‌రించార‌ని కూడా యాంక‌ర్ శ్వేతారెడ్డి తెలిపింది.

అయితే శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై అటు పాల్ కూడా స్పందించారు. శ్వేతా రెడ్డికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయ‌ని, ఆమె క్యారెక్ట‌ర్ మంచిది కాద‌ని, తేడా మనిషి కావ‌డం వ‌ల్లే టిక్కెట్టు ఇవ్వ‌లేద‌ని, త‌నపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆమె నిరూపించ‌గ‌ల‌దా.. అంటూ పాల్ స‌వాల్ విసిరారు. అంతేకాకుండా.. తాము ఆమెకు హిందూపురం టిక్కెట్టు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆమె త‌మ‌పై ఇలా క‌క్ష పెంచుకుని అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని కూడా పాల్ స‌మాధానం చెప్పారు. మ‌రి ముందు ముందు ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news