ఐపిఎస్ వర్సెస్ కేసినేని నానీ, అదేంటి ఎంపీ గారూ…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఈ వ్యవహారంపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సిపిఐ, సిపిఎం కూడా రాష్ట్ర ప్రభుత్వ౦ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఒకరకంగా టీడీపీ షాక్ అయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఎంపీ కేసినేని నానీ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసారు. “మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!” అని కేసినేని నానీ ఏబీని ఉద్దేశించి ట్విట్టర్ లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసారు.

దీనిపై ఏబీ ట్విట్టర్ లో స్పందించారు. ఏమిటోనండి ఎంపీ గారు మీరేమో ఇలా అంటారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి కడుపుబ్బా నటించారు. మీరందరూ పార్లమెంట్ లో కలిసే ఉంటారు. మీరందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వహించానో ఇంకేదైనా చేసానో నాకో క్లారిటీ వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనితో ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news