కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణాలో ఉండకూడదు..

-

కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను.. ఓవైసీ కుటుంబం నుంచి హైద్రాబాద్ ను విముక్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదనే విధంగా టీఆర్ఎస్ వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తాం అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు.

తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో ఇకపై మజ్లీస్ పార్టీ పెత్తనం సాగనివ్వమని అన్నారు. కాగా ఆయన పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమై హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేయాలని సూచనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news