కరోనాతో వైసీపీ నేత మృతి.. షాక్ లో మంత్రి..!

-

కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. రోజురోజుకి వేలల్లో కేసులు, వందల్లో కరోనా మరణాలు నమోదవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందర్నీ బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి. ఆంధ్రప్రదేశ్ లో దీని తీవ్రత అధికంగానే ఉంది. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కొవ్వూరు ఏఎంసీ చైర్మెన్ యాండపల్లి రమేష్ కరోనాతో చనిపోయారు. దీంతో ఒక్కసారిగా కొవ్వూరు నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్న రమేష్ మరణంతో పార్టీ కూడా షాక్ కి గురైంది. పార్టీ ముఖ్యనేతలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇకపోతే మంత్రి తానేటి వనిత గెలుపులో రమేష్ కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆమె తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన గెలుపుకి కృషి చేసి, నిరంతరం తనకు అందుబాటులో ఉండే రమేష్.. ఇకపై ఉండడన్న వార్త తెలియడంతో తానేటి వనిత ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు బోరున విలపిస్తున్న ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు నియోజకవర్గ ముఖ్యనేతలు.

Read more RELATED
Recommended to you

Latest news