కేటిఆర్ సవాల్ కి బిజెపి, కాంగ్రెస్ కి మైండ్ పోతుందిగా…!

-

మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణా మంత్రి కేటిఆర్ హైలెట్ గా నిలుస్తున్నారు. ఆయన వ్యూహాలు, ప్రసంగాలు ప్రతీ ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళడంతో పాటుగా విపక్షాలను ఆత్మరక్షణలోకి నేట్టేస్తున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజకీయంగా బలంగా ఉన్న తెరాసకు ఆయన వ్యూహాలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా,

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్ళారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు విపక్షాలు గెలిచి లాభం ఏంటి అన్నారు. నీతి అయోగ్ తెలంగాణాకు 19 కోట్లు ఇవ్వమని చెప్తే 19 పైసలు కూడా ఇవ్వలేదని కేటిఆర్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ ఇరుకున పడ్డాయి. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి విపక్షాలు గెలిచినా మీకు నిధులు రావనే విషయాన్ని బలంగా చెప్పారు కేటిఆర్.

అదే విధంగా తెలంగాణకు ఇచ్చిన నిధులు విషయంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఆయన కడిగి పారేస్తున్నారు. మీరు తెలంగాణకు ఎం ఇచ్చారో చెప్పాలి అంటూ సవాల్ చేస్తున్నా బిజెపి, కాంగ్రెస్ నేతలు ఇంత ఇచ్చాం ఇంత చేసాం అని చెప్పలేకపోతున్నారు. పోనీ కాంగ్రెస్ ఇంత ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్తే, మేము ఇంత ఇచ్చామని బిజెపి చెప్పి చివరికి వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్దానికి దారి తీస్తుంది గాని ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇలా ప్రచారంలో, మీడియా సమావేశాల్లో కేటిఆర్ చేస్తున్న సవాళ్ళకు ఆ రెండు పార్టీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news