కేటిఆర్ దుమ్ము రేపుతున్నారుగా, దేశంలో ఇప్పుడు ఆయనే హాట్ టాపిక్…?

-

తెలంగాణా మంత్రి కేటిఆర్ ఇప్పుడు దుమ్మురేపుతున్నారు. తెలంగాణాలో ఇన్నాళ్లుగా మరుగున పడిన కొన్ని వ్యవస్థల మీద ఆయన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగు నెలల కాలంలో కేటిఆర్ తీసుకొస్తున్న కంపెనీలు, తెలంగాణాలో పెడుతున్న పెట్టుబడులు చూస్తే ఆయన దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

హైదరాబాద్ కి ఉన్న బ్రాండ్ ని వాడుకుని, పారిశ్రామిక రంగంలో తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన వివరిస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే తాము ఏ విధంగా రాయితీలు ఇస్తాం అనేది చెప్తూ కీలక సంస్థలను తెలంగాణకు తీసుకొస్తున్నారు. దేశంలో ఏ విధంగా చూసినా సరే రాజకీయ స్థిరత్వం గాని, ఆదాయం గాని తెలంగాణకు ఎక్కువగా ఉంది అనేది వాస్తవం.

కీలక రాష్ట్రాలు ఒకసారి చూస్తే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఝార్ఖండ్ ఇలా ఏ రాష్ట్రం చూసినా సరే ఏదోక ఆందోళన లేదా రాజకీయ అలజడులతో ఉన్నాయి. పొత్తుల ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు జరుగుతున్నాయి. కాని తెలంగాణాలో మాత్రం అలాంటి పరిస్థితి ఏ విధంగా చూసినా సరే లేదు అనేది వాస్తవం.

దానిని కేటిఆర్ కంపెనీలకు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను కూడా ఉదాహరణకు చెప్తున్నారు. అక్కడ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చెప్తున్నారు. దేశంలో ఉన్న యువ మంత్రులలో కేటిఆర్ ఇప్పుడు దూకుడుగా వెళ్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు అనేది వాస్తవం. ఏ కంపెనీ వస్తే తెలంగాణకు లాభమో ఆ విధంగానే ఆయన అడుగులు వేస్తూ ముందుకి వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news